స్విమ్మింగ్​పూల్​లో పడి బాలిక మృతి

స్విమ్మింగ్​పూల్​లో పడి బాలిక మృతి

జీడిమెట్ల, వెలుగు: స్విమ్మింగ్​ పూల్​ లో పడి ఓ బాలిక మృతిచెందింది.  పేట్​బషీరాబాద్​ పోలీసులు తెలిపిన ప్రకారం.. ఎన్​ఎసీఎల్​ గ్రేటర్​కమ్యూనిటీకి చెందిన డోలి నిఖిల్​కుమార్ కూతురు ఆద్య(8)కు ఈత నేర్పించేందుకు సోమవారం  స్విమ్మింగ్​ పూల్​కు తీసుకెళ్లాడు.  తండ్రి కూతురు  స్విమ్మింగ్​చేశాక నిఖిల్​కుమార్​తన డ్రెస్​ మార్చుకునేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి తన కూతురు కన్పించలేదు. కొద్దిసేపటి తర్వాత స్విమ్మింగ్​పూల్​లో పడి ఉండటం చూసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.