పెళ్లైన 18 ఏళ్లకు పుట్టిన బాలిక పాము కాటుతో మృతి

పెళ్లైన 18 ఏళ్లకు పుట్టిన బాలిక పాము కాటుతో మృతి

మంచిర్యాల  జిల్లా: పిల్లల కోసం ఆ దంపతులు చేయని పూజలు లేవు. సంప్రదించని డాక్టర్లూ లేరు. అలాంటి వారికి 18 సంవత్సరాల తర్వాత ఆడబిడ్డ పుట్టింది. లేకలేక పుట్టడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. కానీ విధి వక్రీకరించింది. పట్టుమని పది సంవత్సరాలు కూడా నిండకుండానే ఆ పాపను మృత్యువు పాము రూపంలో కాటేసింది. ఈ విషాధ సంఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.

వివరాలు: భీమిని మండలం, మల్లాడి గ్రామానికి చెందిన వెంకన్నకు ఒక్కగానొక్క కూతురు దీపిక (9) అదే గ్రామంలో మూడో క్లాస్ చదువుతుంది. అయితే సోమవారం రాత్రి ఇంటి పక్కకు ఆడుకుంటుండగా పాము కరిచింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే గ్రామంలోని RMP డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో.. అక్కడి నుండి మంచిర్యాల హస్పిటల్ కి తరలించారు. అయితే మంగళవారం ఉదయం చికిత్స పొందుతూ బాలిక మృతి చెందినట్లు తెలిపారు డాక్టర్లు. బాలిక చనిపోవడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. లేకలేక పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ చనిపోయిందంటూ విలపించగా.. వారిని చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతం అయ్యారు.

See Also: రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ పై ముగిసిన విచారణ