కరోనా ఎఫెక్ట్ కారణంగా వైన్ షాపులు మూతపడడంతో తమ భర్తలు మద్యం జోలికి వెళ్లకుండా ఇళ్లల్లోనే ఉంటున్నారని, తమతో సంతోషంగా గడుపుతున్నారని ఇన్ని రోజులు తెగ ఆనందపడ్డారు మహిళలు. కానీ గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం దుకాణాలను తెరిచేందుకు కేంద్రం సడలింపులను ప్రకటించడంతో మందు బాబులు హుషారయ్యారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సోమవారం ఉదయం మద్యంషాపులు తెరవగానే వైన్ షాపుల ఎదుట నానా హంగామా చేశారు. టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. తమ వంతు ఎప్పుడొస్తుందా అనుకుంటూ.. షాపుల ముందు బారులు తీరారు.
ఇదంతా ఒక సైడ్ అయితే… బెంగళూరులో ఇంతకు మించిన ఆశ్చర్య కర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ మద్యం దుకాణం ఎదుట.. అమ్మాయిలు కూడా క్యూ లో నిలిచి ఉన్న ఫొటో ఒక్కటి ఒప్పుడు వైరల్గా మారింది. చూడ్డానికి వారంతా ఉన్నత వర్గానికి చెందినవారుగా ఉన్నారు. వారి కోసం షాపు నిర్వాహకులు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి.. అమ్మకాలు కొనసాగిస్తున్నారు.
అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకెళ్తున్న మహిళలు ఈ ఒక్క విషయంలో మాత్రం వెనకడుగు ఎందుకేయాలనుకున్నారేమో.. ఏకంగా లిక్కర్ షాపుల ముందే క్యూ కట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.