మల్లు రవికి ఎంపీ టికెట్ ఇవ్వండి

మల్లు రవికి ఎంపీ టికెట్ ఇవ్వండి
  •   దీపాదాస్ మున్షీకి కొల్లాపూర్ నేతల వినతి

హైదరాబాద్, వెలుగు: నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ మల్లు రవికి ఇవ్వాలని కొల్లాపూర్ నియోజకవర్గ నేతలు కోరారు. శనివారం ఈ మేరకు హైదరాబాద్ లో ఏఐసీసీ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీని కలిసి వినతిపత్రం అందచేశారు. మల్లు రవికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు  ఆయనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారని నేతలు తెలిపారు. మున్షీని కలిసిన వారిలో పీసీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రంగినేని జగదీశ్వర్, రాము యాదవ్, పరుశురామ్ నాయుడు, కాంతారావులు ఉన్నారు.