ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐహెచ్‌‌‌‌‌‌‌‌ హాకీ ఫైవ్స్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ..ఇండియా కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా రజనీ

ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐహెచ్‌‌‌‌‌‌‌‌  హాకీ ఫైవ్స్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ..ఇండియా  కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా రజనీ

న్యూఢిల్లీ: ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐహెచ్‌‌‌‌‌‌‌‌ హాకీ ఫైవ్స్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ కోసం ఇండియా టీమ్స్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించారు. ఏపీ ప్లేయర్‌‌‌‌‌‌‌‌, గోల్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌ ఎతిమరపు రజనీ విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ను నడిపించనుంది. మహిమ చౌదరీ వైస్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా ఎంపికైంది. బాన్సరి సోలంకీ, అక్షతా అబాసో, జ్యోతి ఛెత్రి, మరియానా కుజుర్‌‌‌‌‌‌‌‌, ముంతాజ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌, అజ్మీనా కుజురు, రుతుజా దాదాసో, దీపికా సోరెంగ్‌‌‌‌‌‌‌‌కు చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. ఈ నెల 24 నుంచి 27 వరకు మస్కట్‌‌‌‌‌‌‌‌లో పోటీలు జరగనున్నాయి. 

గ్రూప్‌‌‌‌‌‌‌‌–సిలో ఇండియాతో పాటు నమీబియా, పోలెండ్‌‌‌‌‌‌‌‌, అమెరికా ఉన్నాయి. ఇక మెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు సిమ్రన్‌‌‌‌‌‌‌‌జిత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ సారథ్యం వహించనున్నాడు. మన్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ మోరె, సూరజ్‌‌‌‌‌‌‌‌ కర్కేరియా, ప్రశాంత్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, మంజిత్‌‌‌‌‌‌‌‌, మహ్మద్‌‌‌‌‌‌‌‌ రాహీల్‌‌‌‌‌‌‌‌, మణిందర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, పవన్‌‌‌‌‌‌‌‌, గురుజ్యోత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ బరిలో ఉన్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు టోర్నీ జరగనుంది. పూల్‌‌‌‌‌‌‌‌–బిలో ఇండియాతో ఈజిప్టు, జమైకా, స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి.