శ్రీవారి ఆలయంలో గోదా పరిణయోత్సవం.. పలు ఆర్జిత సేవలు రద్దు

శ్రీవారి ఆలయంలో గోదా పరిణయోత్సవం.. పలు ఆర్జిత సేవలు రద్దు

ఈరోజు(జనవరి 16) తిరుమల శ్రీవారి ఆలయంలో గోదా పరిణయోత్సవం నిర్వహిస్తున్నారు ఆలయ అధికారులు. ‌ఇందులోభాగంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించనున్నారు. తెల్లవారు జామునే ఆండాళ్ అమ్మవారి మాలలు శ్రీవారికి సమర్పించారు. మధ్యాహ్నం పార్వేట మండపానికి మలయప్పస్వామి తీసుకొస్తారు.

ఆ తర్వాత శ్రీవారికి ఆస్థానం, పార్వేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా పలు ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. అందులో భాగంగా అష్టాదళ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు అయ్యాయి. 

సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలోని శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యంవ‌ద్ద శ్రీకృష్ణ స్వామి వారికి, గోదాదేవి అమ్మవారికి ప‌రిణ‌యోత్స‌వం నిర్వహింస్తారు.