అందరికీ మంచి జరగాలని దుర్గామాతను కోరుకుంటున్నా : గవర్నర్ తమిళిసై

అందరికీ మంచి జరగాలని దుర్గామాతను కోరుకుంటున్నా : గవర్నర్ తమిళిసై

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై దసరా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈ నవరాత్రి పండుగలో ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో దుర్గా మాతను పూజించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటారు.

రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని దుర్గామాతను కోరుకుంటున్నా” అని గవర్నర్ పేర్కొన్నారు. దసరా సందర్భంగా రాజ్ భవన్ లో నిర్వహించిన వెహికల్ పూజలో తమిళిసై పాల్గొన్నారు. రాజ్ భవన్ సిబ్బందికి, అధికారులకు గ్రీటింగ్స్ తెలిపారు.