Gold Rate: మండిపోతున్న బంగారం, వెండి రేట్లు.. తులం రూ.లక్షా 20వేలు దాటేసిన గోల్డ్..

Gold Rate: మండిపోతున్న బంగారం, వెండి రేట్లు.. తులం రూ.లక్షా 20వేలు దాటేసిన గోల్డ్..

Gold Price Today: దసరా పండుగ తర్వాత దీపావళికి ముందు బంగారం, వెండి రేట్లు విపరీతమైన పెరుగుదలను చూస్తున్నాయి. ప్రధానంగా గోల్డ్ ర్యాలీ భారతీయులను ఆందోళనకు గురిచేస్తోంది. అక్టోబర్ స్టార్టింగ్ నుంచి రేట్లు ఆగకుండా పెరుగుతూ పోవటానికి అమెరికా షట్ డౌన్ నుంచి డాలర్ పతనం వరకు అనేక కారణాలు దోహదపడుతున్నాయి. ఈ క్రమంలో వారం ప్రారంభంలో షాపింగ్ చేయటానికి వెళ్లాలనుకుంటున్న  రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ప్రధాన నగరాల్లో ఇవాళ పెరిగిన రిటైల్ అమ్మకపు రేట్లను ముందుగా తెలుసుకోవటం చాలా ముఖ్యం..

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే అక్టోబర్ 5తో పోల్చితే 10 గ్రాములకు అక్టోబర్ 6న రూ.1370 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.137 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి..

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 6న):

  • హైదరాదాబాదులో రూ.12వేల 077
  • కరీంనగర్ లో రూ.12వేల 077
  • ఖమ్మంలో రూ.12వేల 077
  • నిజామాబాద్ లో రూ.12వేల 077
  • విజయవాడలో రూ.12వేల 077
  • కడపలో రూ.12వేల 077
  • విశాఖలో రూ.12వేల 077
  • నెల్లూరు రూ.12వేల 077
  • తిరుపతిలో రూ.12వేల 077

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు అక్టోబర్ 5తో పోల్చితే ఇవాళ అంటే అక్టోబర్ 6న 10 గ్రాములకు రూ.1250 పెరుగుదలను చూసింది. దీంతో సోమవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

ALSO READ : ఒక బిట్‌‌కాయిన్ ధర కోటి పది లక్షలపైనే

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 6న):

  • హైదరాదాబాదులో రూ.11వేల 070
  • కరీంనగర్ లో రూ.11వేల 070
  • ఖమ్మంలో రూ.11వేల 070
  • నిజామాబాద్ లో రూ.11వేల 070
  • విజయవాడలో రూ.11వేల 070
  • కడపలో రూ.11వేల 070
  • విశాఖలో రూ.11వేల 070
  • నెల్లూరు రూ.11వేల 070
  • తిరుపతిలో రూ.11వేల 070

మరోపక్క దసరా రోజున వెండి తమ ర్యాలీని కొనసాగించగా పండుగ తర్వాత తిరిగి తగ్గింది. అక్టోబర్ 6న కేజీకి వెండి అక్టోబర్ 5తో పోల్చితే రూ.వేయ్యి పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 66వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.166 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.