
మ్యూనిక్: ఇండియా షూటర్ సురుచి సింగ్.. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్లో గోల్డ్ మెడల్తో మెరిసింది. శుక్రవారం (june 13) జరిగిన విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో 19 ఏళ్ల సురుచి 241.9 పాయింట్లతో టాప్ ప్లేస్లో నిలిచింది.
దాంతో కెరీర్లో వరుసగా మూడు వరల్డ్ కప్స్లోస్వర్ణంతో మెరిసి హ్యాట్రిక్ సాధించింది. ఓవరాల్గా ఆమెకిది నాలుగో బంగారు పతకం కావడం విశేషం. ఏప్రిల్లో బ్యూనస్ ఎయిర్స్లో జరిగిన మెగా టోర్నీలోనూ సురుచి గోల్డ్ను సాధించింది. కామిల్లె జెడ్రెజెస్కీ ( ఫ్రాన్స్, 241.7), క్విన్జున్ యావో (చైనా, 221.7) సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ను సొంతం చేసుకున్నారు.
ఫైనల్ షాట్లో కామిల్లె 9.8 పాయింట్లు నెగ్గినా, సురుచి 9.5తో టాప్ ప్లేస్ను కైవసం చేసుకుంది. క్వాలిఫికేషన్లో సురుచి 588 పాయింట్లతో రెండో ప్లేస్లో నిలవగా, మను భాకర్ 574 పాయింట్లతో 25వ స్థానంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో కామెంటరీ చేసిన భాకర్.. సురుచి గోల్డ్ నెగ్గడంపై సంతోషాన్ని వ్యక్తం చేసింది.