యాదాద్రి రాజగోపురానికి బంగారు తాపడం

యాదాద్రి రాజగోపురానికి బంగారు తాపడం

రూ. 40 కోట్లు ఖర్చవుతుందని అంచనా

యాదాద్రి, వెలుగు: యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆలయం దివ్య విమాన రాజగోపురానికి స్వర్ణకాంతులు అద్దనున్నారు. ఇందుకోసం 60 కిలోల బంగారాన్ని ఉపయోగించనున్నారు. ఇందుకోసం రూ. 40 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఆలయ పునర్  నిర్మాణంలో భక్తులు పాలు పంచుకోవాలని, డబ్బు లేదా వస్తు రూపంలో విరాళాలు ఇవ్వాలని ఈవో గీత ఒక ప్రకటనలో కోరారు.

10 నుంచి కృష్ణా ష్టమి ఉత్సవాలు

స్వామి వారి బాలాలయంలో వచ్చే నెల 10 నుంచి 12 వరకు వైష్ణవ సంప్రదాయం ప్రకారం శ్రీ కన్నన్ తిరు నక్షత్ర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రుక్మిణీ కల్యాణం జరుపుతారు.