- హైదరాబాద్లో రూ.69,380
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో బంగారం ధర (10 గ్రాములు) సోమవారం రూ.1,070 పెరిగి ఆల్టైమ్ గరిష్ఠ స్థాయి రూ.68,420లకు చేరుకుంది. హైదరాబాద్లో ధర రూ.69,380లకు చేరింది. గ్లోబల్ మార్కెట్లలో మెటల్లో ర్యాలీ కారణంగా పసిడి ధరలు దూసుకెళ్లాయి. క్రితం ట్రేడింగ్లో 10 గ్రాముల విలువైన గోల్డ్ రూ.67,350 వద్ద ముగిసింది. వెండి ధర కూడా కిలో రూ.1,120 పెరిగి రూ.78,570కి చేరుకుంది.
క్రితం ట్రేడింగ్లో కిలో రూ.77,450 వద్ద ముగిసింది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండటంతో బంగారం ధరలు రికార్డు స్థాయిలను తాకాయి. చైనా నుంచి బలమైన డిమాండ్ వల్ల ధరలు పెరుగుతున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్లోని రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ చెప్పారు.
ఎంసీఎక్స్లో ఫ్యూచర్స్ ట్రేడ్లో, జూన్ కాంట్రాక్ట్ బంగారం ధర10 గ్రాములకు రూ.978 పెరిగి రూ.68,679కి చేరుకుంది. మే నెల కాంట్రాక్టు వెండి కిలో రూ.763 పెరిగి రూ.75,811కి చేరుకుంది. విదేశీ మార్కెట్లలో, స్పాట్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ బంగారం ధరలు ఔన్స్కు 2,265.73 డాలర్ల వరకు పెరిగాయి.