శంషాబాద్ ఎయిర్​పోర్టులో భారీగా గోల్డ్ సీజ్

శంషాబాద్ ఎయిర్​పోర్టులో భారీగా గోల్డ్ సీజ్

శంషాబాద్, వెలుగు: బంగారాన్ని తరలిస్తున్న ప్యాసింజర్​ను శంషాబాద్ ఎయిర్​పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం ఖతార్ రాజధాని దోహ నుంచి శంషాబాద్​కు చేరుకున్న ఓ ప్యాసింజర్ బంగారం పేస్ట్​ను  తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. 701 గ్రాముల బంగారం పేస్ట్​ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 42 లక్షల 96 వేలు ఉంటుందని అంచనా వేశారు. ప్యాసింజర్​పై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.