బట్టతలలో బంగారం స్మగ్లింగ్

బట్టతలలో బంగారం స్మగ్లింగ్

ఢిల్లీ : గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది పట్టుకున్నారు. అబుదాబీ నుంచి అక్రమంగా బంగారం తీసుకువస్తున్న సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్యాసింజర్ పై అనుమానంతో తనిఖీ నిర్వహించిన కస్టమ్స్ అధికారులు అతని విగ్గును తొలగించడంతో పేస్టు రూపంలో ఉన్న బంగారం బయటపడింది. దాదాపు 630 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.30.55 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితున్ని అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.