వేటికి సడలింపు ఇద్దాం

వేటికి సడలింపు ఇద్దాం

న్యూఢిల్లీ : ఏప్రిల్ 20 తర్వాత లాక్ డౌన్ నిబంధనల్లో వేటికి సడలింపు ఇవ్వాలన్న దానిపై కేంద్రమంత్రులు చర్చలు జరిపారు. లాక్ డౌన్ లో వేటికి సడలింపు ఇవ్వాలన్న మోడీ సూచన మేరకు రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో ఢిల్లీలో మంత్రులు భేటీ అయ్యారు. పేదలు ఇబ్బంది పడకుండా అనుసరించాల్సిన వ్యూహంపైచర్చించినట్లు రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అదే విధంగా దేశంలో కరోనా కేసులపై రివ్యూ చేశారు. ఈ సమావేశంలో మంత్రులు పీయూష్ గోయెల్, ప్రకాశ్ జావదేకర్, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రదాన్, రామ్ విలాస్ పశ్వాన్, గిరిరాజ్ సింగ్, సంతోష్ గంగ్వార్, రమేష్ పోఖ్రియాల్ పాల్గొన్నారు.