Good Health : పారా బాయిల్డ్ రైస్ తింటే.. బలమే కాదు.. షుగర్ కూడా పెరగదు

Good Health : పారా బాయిల్డ్ రైస్ తింటే.. బలమే కాదు.. షుగర్ కూడా పెరగదు

ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా వాడే పాఠా బాయిల్డ్ బియ్యం ఇప్పుడు. మన దగ్గర కూడా పండిస్తున్నారు చాలామంది రైతులు. ఆ బియ్యంతో ఆరోగ్యం సొంతం అవుతుందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. బియ్యం ఎన్నో రకాలు. వాటిలో పారా బాయిల్డ్ బియ్యం ఒకటి. పారాబాయిల్డ్ అంటే ఉడికించిన బియ్యం. వండడానికి ముందే స్టీమ్ చేసి ఆరబెట్టినవి. వీటిని ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ వాడతారు. బియ్యం నానబెట్టి, స్టీమ్ చేసి, మళ్లీ ఆరబెడతారు. దీంతో తేమ పోయి పోషకాలు పెరుగుతాయి. దానివల్ల బియ్యం కాస్త రంగు కూడా మారుతుంది. ఇది తెల్ల అన్నం కంటే మెత్తగా ఉంటుంది. కానీ ఎక్కువ అంటుకోదు. పారా బాయిల్డ్ రైస్ హెల్తు కూడా ఎంతో ఉపయోగం. రెగ్యులర్ బియ్యంతో పోలిస్తే పాఠా బాయిల్డ్ అన్నంలో తక్కువ కేలరీలు ఉంటాయి. ఎక్కువ ఫైబర్, ప్రొటీన్లు ఉంటాయి.

  • అర కిలో పారా బాయిల్ బియ్యంలో 776కేలరీల శక్తి ఉంటుంది.
  • 2 గ్రాముల ఫ్యాట్, 164 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 4 గ్రాముల ఫైబర్, 20 గ్రాములు ప్రొటీన్లు ఉంటాయి.
  • పారా బాయిల్డ్ రైస్ లోని పిండి పదార్థాలు ఒక ప్రీబయోటిక్గా పనిచేస్తాయి. పేగుల్లో హెల్దీ బ్యాక్టీరియాను పెంచుతాయి. అలాగే డైజెస్టింగ్ సిస్టమ్లో సూక్ష్మజీవులను బ్యాలెన్స్ చేస్తుంది ఈ బియ్యం. ఫిజికల్ హెల్త్ నుంచి మెంటల్ హెల్త్ వరకు ఈ బియ్యం ప్రభావాన్ని చూపుతుంది.

ALSO READ : ఉస్తాద్ అప్డేట్.. ఆ ఒక్కరోజు పవన్ సినిమాకు బ్రేక్.. కారణం?

డయాబెటిస్ సమస్యలకు

తెలుపు బియ్యం, బ్రౌన్ రైస్ రెండిటితో పోలిస్తే, పారా బాయిల్డ్ రైస్ రక్తంలో షుగర్ లెవల్స్ పై తక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి. షుగర్ ఉన్న వాళ్లకి ఈ రైస్ మంచిదంటున్నారు. బియ్యాన్ని తక్కువ టెంపరేచర్లో ఉంచినా లేదా వండిన అన్నాన్ని ఫ్రిజ్ లో పెట్టి తర్వాత తిన్నా బాగుంటుంది. పైగా షుగర్ లెవల్స్ ను ఈ చల్లన్నం తగ్గిస్తుంది.