చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల నుంచి గచ్చిబౌలి వరకు బస్సు సర్వీస్ను ఆర్టీసీ ప్రారంభించింది. చేవెళ్లతో పాటు మొయినాబాద్ ప్రాంతం నుంచి వందల మంది గచ్చిబౌలి ఏరియాలోని సాఫ్ట్ వేర్ ఆఫీసుల్లో పనిచేస్తున్నారు. అక్కడికి వెళ్లాలంటే అప్పా జంక్షన్ వరకు వెళ్లి.. అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది.
వీరి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని టీఎస్ ఆర్టీసీ సిటీ రీజినల్ మేనేజర్ సుధా పరిమళ ఆదేశాల మేరకు శుక్రవారం మెహిదీపట్నం డిపో మేనేజర్ బీవీకే మూర్తి మెట్రో డీలక్స్ సర్వీస్ ప్రారంభించారు. 593/316 నంబర్ గల ఈ బస్సు చేవెళ్ల, మొయినాబాద్, అప్పా జంక్షన్ , నార్సింగి జంక్షన్ మీదుగా ఓఆర్ ఆర్ సర్వీస్ రోడ్డులో గచ్చిబౌలి వరకు ఉదయం ఒక ట్రిప్పు, సాయంత్రం ఒక ట్రిప్పు తిరుగుతుంది.
