మహిళా ​ క్రికెటర్లకు గుడ్​న్యూస్..వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ గెలిస్తే 9.93 కోట్లు

మహిళా ​ క్రికెటర్లకు గుడ్​న్యూస్..వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ గెలిస్తే 9.93 కోట్లు

దుబాయ్​: వచ్చే నెలలో న్యూజిలాండ్​ వేదికగా జరిగే విమెన్స్‌‌‌‌‌‌‌‌ వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌నకు ముందు విమెన్​ క్రికెటర్లకు ఐసీసీ గుడ్​న్యూస్​ చెప్పింది. మెగా టోర్నీ  ప్రైజ్‌‌‌‌‌‌‌‌మనీని భారీగా పెంచింది. మొత్తం ప్రైజ్‌‌‌‌‌‌‌‌మనీని గత ఎడిషన్​తో పోలిస్తే  75 శాతం పెంచి రూ. 26 కోట్ల 34 లక్షలు గా నిర్ణయించింది. విన్నర్‌‌‌‌‌‌‌‌కు రూ. 9 కోట్ల 93 లక్షలు దక్కనున్నాయి. రన్నరప్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు రూ. 4 కోట్ల 51 లక్షలు ఇస్తారు. సెమీస్‌‌‌‌‌‌‌‌లో ఓడిన టీమ్స్‌‌‌‌‌‌‌‌కు చెరో రూ. 2 కోట్ల 25 లక్షలు కేటాయించారు. గ్రూప్‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌లో గెలిచిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లకు రూ. 18 లక్షలు ఇస్తారు.