
న్యూఢిల్లీ: దీపావళి పండుగ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెల, జులై–సెప్టెంబర్ క్వార్టర్కి సంబంధించిన జీఎస్టీఆర్–3బీ ఫారమ్ ఫైలింగ్ గడువును 5 రోజులు పొడిగించింది. ఇప్పుడు ఈ ఫారమ్ను అక్టోబర్ 25 వరకు ఫైల్ చేయవచ్చు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. జీఎస్టీఆర్–3బీ అనేది నెలవారీ, క్వార్టర్లీ సమరీ రిటర్న్. దీనిని రిజిస్టర్డ్ టాక్స్పేయర్లు తమ వర్గాల ప్రకారం 20, 22, 24 తేదీల్లో ఫైల్ చేస్తారు.