ఇద్దరు హైదరాబాదీలు కలిసిన శుభారంభం అంటూ మంత్రి కేటీఆర్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో దిగిన ఓ ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దాంతో పాటు తాము బిజినెస్ & బిర్యానీ గురించి చాట్ చేశామంటూ ఓ స్మైల్ ఎమోజీని షేర్ చేశారు. అంతకుముందు చాట్ రోబోట్ సాఫ్ట్వేర్ చాట్జీపీటీకి, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు మధ్య హైదరాబాద్ బిర్యానీ గురించి సరదాగా సంభాషణ జరిగింది. బెంగళూరులోని ఫ్యూచర్ రెడీ సమ్మిట్లో పాల్గొన్న నాదెళ్ల, పాపులర్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఏమిటో చెప్పాలని చాట్జీపీటీని అడిగారు. దీనికి సమాధానంగా చాట్జీపీటీ సాఫ్ట్వేర్ ఇడ్లీ, దోశ, వడా పేర్లు చెబుతూనే బిర్యానీని కూడా టిఫిన్గా పేర్కొంది.
ఒక హైదరాబాదీ అయిన తనకు బిర్యానీ టిఫిన్ కాదనే విషయం తెలుసని, తన ఇంటెలిజెన్స్ను పరీక్షించాల్సిన అవసరం లేదని నాదెళ్ల పేర్కొన్నారు. దీనికి ఈ చాట్బోట్ సారీ చెప్పింది కూడా. నాదెళ్ల ఇడ్లీ, దోశలో ఏది బెటరో చెప్పమని కూడా ఈ ఏఐ బేస్డ్ చాట్బోట్ను అడిగారు. ఏఐ బేస్డ్ టెక్నాలజీ గురించి మాట్లాడే ముందు చాట్బోట్కు ఆయనీ ప్రశ్నలు వేశారు.