హైదరాబాద్ సిటీ, వెలుగు: పెంచిన టెస్టింగ్ చార్జీలు, ఫిట్నెస్ చార్జీలను కేంద్ర ప్రభుత్వం వాపస్ తీస్కోవాలని సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి నుంచి బంద్ పాటిస్తున్నామని, సమ్మె కొనసాగుతుందని ప్రకటించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్ మాట్లాడారు.
పాత వాహనాలను రోడ్లపైకి రాకుండా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సంప్రదింపులు జరిపేందుకు అధికారులు కూడా సహకరించకపోవడంతో సమ్మె తప్పట్లేదన్నారు. ఇప్పటివరకు 13 సంవత్సరాలుదాటిన వాహనాల ఫిట్నెస్, టెస్టింగ్ కోసం రూ.12 వేలు వసూలు చేసేవారని, పెంచిన ఫీజుల ప్రకారం ఇప్పుడు రూ.30 వేలు చెల్లించాల్సి వస్తోందని వాపోయారు.

