రాజమండ్రి వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

రాజమండ్రి వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ఏపీలోని రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఈ మార్గంలో ఒకే ట్రాక్ పై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడంతో 9 రైళ్లు రద్దు అయ్యాయి.

విజయవాడ నుంచి లింగపల్లి వెళ్లే రైలు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఒకే ట్రాక్ పై రాకపోకల కారణంగా మరికొన్ని ట్రైన్ సర్వీసులు కూడా ఆలస్యంగా నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 

విజయవాడ - విశాఖ

గుంటూరు - విశాఖ, విజయవాడ 

విజయవాడ  - విశాఖ -  విజయవాడ 

విజయవాడ - గుంటూరు

కాకినాడ పోర్టు - విజయవాడ 

పై రైళ్లు పూర్తిగా రద్దవ్వగా.. విజయవాడ - రాజ మహేంద్రవరం, కాకినాడ పోర్టు  -  విజయవాడ రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి.