రూల్స్ పాటించకుంటే జీతం కట్

రూల్స్ పాటించకుంటే జీతం కట్

కరోనా రూల్స్ విషయంలో టెక్ దిగ్గజం కఠినంగా ఉండాలని నిర్ణయించింది. కంపెనీ కొవిడ్ వ్యాక్సినేషన్ పాలసీని పాటించని ఉద్యోగులపై వేటు తప్పదని ప్రకటించింది. అలాంటి ఎంప్లాయీస్ జీతాల్లో కోతలు, అవసరమైతే ఉద్యోగం నుంచి తీసేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రీసెంట్ గా ఉద్యోగులకు గూగుల్ మెమో జారీ చేసినట్లు ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 3లోగా వ్యాక్సినేషన్ స్టేటస్ ప్రకటించాలని, అందుకు సంబంధించిన సర్టిఫికేట్ అప్ లోడ్ చేయాలని గూగుల్ ఆ మెమోలో పేర్కొంది. 

ఒకవేళ ఏదైనా కారణాలతో మినహాయింపు కావాలనుకుంటే దాని కోసం దరఖాస్తు చేసుకోవాలని గూగుల్ తెలిపినట్లు తెలుస్తోంది. నిర్ణీత తేదీలోపు వ్యాక్సినేషన్ స్టేటస్ అప్ లోడ్ చేయని ఉద్యోగులకు చివరి అవకాశంగా వచ్చే ఏడాది జనవరి 18 తేదీని టార్గెట్ గా ఫిక్స్ చేసింది. అప్పటికీ రూల్స్ పాటించని ఉద్యోగులను 30 రోజుల శాలరీతో కూడిన సెలవులోకి పంపుతామని, ఆ తర్వాత ఆరు నెలల వరకు పర్సనల్ లీవ్స్ ఇచ్చి ఉద్యోగంలో నుంచి తొలగిస్తామని గూగుల్ హెచ్చరించినట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై గూగుల్ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. 

మరిన్ని వార్తల కోసం: 

తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంట్రీ

ప్రస్తుత పరిస్థితుల్లో టీకాలు పని చేస్తాయని చెప్పలేం

సినీ ఇండస్ట్రీని కాపాడి తీరుతాం