కరెంట్​ రిపేర్లు ఆలస్యం చేయొద్దు

కరెంట్​ రిపేర్లు ఆలస్యం చేయొద్దు

నక్కలగుట్ట, వెలుగు: ట్రాన్స్​ఫార్మర్ల  ఫెయిల్యూర్స్​ తగ్గించడంతో పాటు రిపేర్లు ఆలస్యం కాకుండా చూడాలని టీఎస్​ ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాలరావు ఆఫీసర్లను ఆదేశించారు. హనుమకొండ నక్కలగుట్టలోని టీఎస్​ ఎన్పీడీసీఎల్  విద్యుత్​ భవన్​లో సోమవారం వరంగల్, మహబూబాబాద్​ జిల్లాల ఎస్ఈలు, డీఈలు, ఇతర ఆఫీసర్లతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ..  ఎన్పీడీసీఎల్​ దత్తత గ్రామాల్లో పారామీటర్ల పరంగా అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. 

ALSOREAD:కౌశిక్ రెడ్డిపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలి .. రాష్ట్ర ముదిరాజ్ సంఘం ఫైర్​

 కాలిపోయిన, పనిచేయని మీటర్లను మార్చాలని,  సంవత్సరం పైబడిన డిస్ కనెక్షన్  లిస్ట్ సర్వీసులను తనిఖీ చేయాలన్నారు.  సబ్ స్టేషన్ల నిర్వహణ ఎప్పటికప్పుడు చూసుకోవాలని,  లైన్ల పాట్రోలింగ్ తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు.  సిబ్బంది హెడ్ క్వార్టర్స్​ లోనే ఉండాలని, ట్రాన్స్ ఫార్మర్ల రిపేర్లు పెంచాలన్నా రు. కార్యక్రమంలో డైరెక్టర్లు  బి.వెంకటేశ్వర రావు,  పి.గణపతి,  పి.సంధ్యారాణి,  పి.మోహన్ రెడ్డి,  వి.తిరుపతి రెడ్డి, సీజీఎంలు,  ఎస్ఈలు పాల్గొన్నారు.