గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

మహారాష్ట్రలోని  నాసిక్ సమీపంలో ముంబైLTT, గోరఖ్‪పూర్ మధ్య నడిచే గోరఖ్‪పూర్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రైలును గోదాన్ ఎక్స్ ప్రెస్ అని కూడా పిలుస్తారు. శుక్రవారం (మార్చి 22) మధ్యాహ్నం 3గంటలకు నాసిక్ రోడ్ స్టేషన్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ట్రైన్ చివర ఉన్న ఆఖరి బోగీలో మంటలు చెలరేగాయి.  వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ట్రైన్ నుంచి ఆ బోగీని వేరు చేశారు. ఆ బోగీలో లగేజీ బ్యాగులు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.