ప్రజలు ఇబ్బందులు పడకుండా సర్కార్ ​చర్యలు : వివేక్​ వెంకటస్వామి

ప్రజలు ఇబ్బందులు పడకుండా సర్కార్ ​చర్యలు : వివేక్​ వెంకటస్వామి

కోల్​బెల్ట్, వెలుగు: ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆరోగ్య ఖర్చుల కోసం సీఎం రేవంత్​రెడ్డి సత్వరమే ఎల్ఓసీలు మంజూరు చేస్తున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. గురువారం మందమర్రి ఎంపీడీవో ఆఫీస్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలానికి చెందిన బొలిశెట్టి శ్రీనివాస్​కు రూ.2.50 లక్షల ఎల్​వోసీ అందజేశారు. అనంతరం మందమర్రి మండలం చిర్రకుంట గ్రామంలోని ఎస్సీ వాడలో ఏర్పాటుచేసిన బోరు పంపును ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామస్తులు ఆయనను ఘనంగా సన్మానించారు. 

అనంతరం మందమర్రిలోని బి-1 ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో చేపట్టిన పనులను పరిశీలించారు. కాంగ్రెస్​ పట్టణ మహిళా అధ్యక్షురాలు గడ్డం రజనీ బర్త్​డే వేడుకల్లో ఎమ్మెల్యే వివేక్​ పాల్గొన్నారు. కార్యక్రమాల్లో జడ్పీ చైర్​పర్సన్​ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఎంపీపీ గుర్రం మంగా శ్రీనివాస్​ గౌడ్,  వైస్​ ఎంపీపీ రాజ్​కుమార్, జడ్పీటీసీ రవి, క్యాతనపల్లి మున్సిపల్​ చైర్​పర్సన్ ​జంగం కళ, మందమర్రి మున్సిపల్​కమిషనర్​ వెంకటేశ్వర్లు, పలువురు అధికారులు, కాంగ్రెస్​ లీడర్లు పాల్గొన్నారు. 

వేతనాలు పెంచాలని నాలుగు రోజులుగా మందమర్రి ఏరియా కేకే ఓసీపీలో సమ్మె చేస్తున్న ఆర్​వీఆర్​ కాంట్రాక్ట్ ​డ్రైవర్లు వివేక్​వెంకటస్వామిని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. వారి సమస్యపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.