- నిర్మాణాలు ఆలస్యం చేసే కాంట్రాక్టర్లపై యాక్షన్
- ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్రెడ్డి
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో కొనసాగుతున్న ఆర్వోబీ నిర్మాణాలకు నిధులు రిలీజ్ చేశామని ప్రభుత్వ సలహాదారుడు పి.సుదర్శన్రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాలపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. మాధవ్నగర్ బ్రిడ్జికి రూ.3.15 కోట్లు, అర్సాపల్లి ఆర్వోబీకి రూ.7.46 కోట్లు ఇచ్చామన్నారు. ప్రజా రవాణా వసతిని పెంచే ఈ రెండు నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని, నిర్లక్ష్యం చేసే కాంట్రాక్టర్లను బ్లాక్లిస్టులో పెడుతామని హెచ్చరించారు. అడివిమామిడిపల్లి బ్రిడ్జి వద్ద బీటీ రోడ్డు నిర్మాణాన్ని డిసెంబర్ 15 నాటికి పూర్తి చేయాలన్నారు. వివిధ ఉద్యోగ సంఘాల నేతలు సుదర్శన్రెడ్డిని సన్మానించి జ్ణాపికలను అందజేశారు.
పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం..
జిల్లాలో భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సుదర్శన్రెడ్డి తెలిపారు. రంగుమారిన, మొలకెత్తిన వడ్లను కొనుగోలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు 4 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. మరో 2.5 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, అడిషనల్కలెక్టర్ కిరణ్కుమార్ ఉన్నారు.
చెరువుల్లో నాలుగు కోట్ల చేప పిల్లలు..
ఎడపల్లి : నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువుల్లో నాలుగు కోట్ల చేప పిల్లలను విడుదల చేసినట్లు ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి తెలిపారు. శనివారం మండలంలో ని జానకంపేట్ గ్రామ శివారు అశోక్ సాగర్ చెరువులో కలెక్టర్తో కలిసి చేప పిల్లలను విడుదల చేసి మాట్లాడారు. గంగపుత్రులకు ఉచితంగా చేప పిల్లలు అందిస్తున్నామన్నారు. జానకంపేట్ చెరువులో 1,14,600 చేపపిల్లలను వదిలారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పులి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రాంమోహన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మత్య్సశాఖ అధికారులు ఆంజనేయ స్వామి , లాయక్ మొహినొద్దీన్, ప్రవీన్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
