ఎంబీబీఎస్ సీట్లలో మనోళ్లకు మళ్లా అన్యాయమే!

ఎంబీబీఎస్ సీట్లలో మనోళ్లకు మళ్లా అన్యాయమే!

ఎంబీబీఎస్​ సీట్ల కేటాయింపులో తెలంగాణ స్టూడెంట్లకు మరోసారి అన్యాయం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కౌన్సెలింగ్​ రూల్స్​ మార్చకపోవడంతో నష్టపోతున్నారు. లోకల్ స్టూడెంట్లకు దక్కాల్సిన సీట్లు నిరుడు ఏపీ స్టూడెంట్లకు వెళ్లాయి. ఎలిజిబిలిటీ ఉన్నా ఇక్కడి స్టూడెంట్లకు సీట్లు దక్కలేదు. రిజర్వ్‌‌డ్ కేటగిరీ స్టూడెంట్ల విషయంలోనూ అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. నీట్‌‌లో మెరిట్ ర్యాంకులు వచ్చిన రిజర్వ్‌‌డ్ కేటగిరీ స్టూడెంట్లకు ఓపెన్ కేటగిరీ సీట్లకు బదులు, రిజర్వ్‌‌డ్ కేటగిరీ సీట్లను కేటాయించారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్లు నష్టపోయారు. 

హైదరాబాద్, వెలుగు: రెండేండ్లుగా నీట్​ కౌన్సెలింగ్​లో లోకల్​ స్టూడెంట్లకు అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదు. ఇక్కడి వాళ్లకు దక్కాల్సిన ఎంబీబీఎస్​ సీట్లు ఏపీ స్టూడెంట్లకు వెళ్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సీట్ల ‘బ్లాకింగ్’ ​దందాపైనా స్పందించడం లేదు. ఏపీ మాత్రం అక్కడి స్టూడెంట్ల కోసం రూల్స్​ మార్చి అమలు చేస్తున్నా.. మన సర్కారు మనోళ్ల కోసం ఎలాంటి మార్పులు చేయడం లేదు. ఈ వ్యవహారంపై నిరుడు స్టూడెంట్లు, తల్లిదండ్రులు, స్టూడెంట్​ యూనియన్లు, ప్రజా సంఘాల లీడర్లు పలుమార్లు ఫిర్యాదు చేశారు. దీంతో కాళోజీ హెల్త్ వర్సిటీ వైస్ చాన్స్‌‌లర్‌‌‌‌, హెల్త్ సెక్రటరీ, డీఎంఈ తదితర ఆఫీసర్లతో ఓ మీటింగ్ ఏర్పాటు చేసి, కౌన్సెలింగ్‌‌లో ఉన్న లోపాలు ఏంటో చెప్పాలని ప్రజాసంఘాల నాయకులను అప్పట్లో పిలిపించింది. కౌన్సెలింగ్ ప్రొసీజర్‌‌‌‌లో ఉన్న రూల్స్‌‌ వల్లే రిజర్వ్‌‌డ్‌‌ స్టూడెంట్లకు, లోకల్ స్టూడెంట్లకు అన్యాయం జరుగుతోందని తేలింది. అప్పటికే కౌన్సెలింగ్‌‌ చివరి దశకు రావడంతో సర్కారు చేతులెత్తేసింది. కౌన్సెలింగ్ రూల్స్‌‌ మార్చేందుకు ఓ కమిటీ వేస్తామని ప్రకటించింది. కానీ, ఇప్పటివరకూ కమిటీ వేయలేదు. రూల్స్ మార్చలేదు. మరోవైపు ఇప్పుడు మళ్లీ కౌన్సెలింగ్​కు గడువు సమీపిస్తోంది. ఈ నెల 12న నీట్ ఎగ్జామ్‌‌ ముగిసింది. ఇంకో రెండు లేదా మూడు వారాల్లో రిజల్ట్స్​ వచ్చే అవకాశం ఉంది. ఆ వెంటనే కౌన్సెలింగ్ ప్రారంభించాల్సి ఉంటుంది. ఈలోగా రూల్స్‌‌ మార్చకపోతే ఈసారి కూడా మన స్టూడెంట్లకు నష్టం తప్పదు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో 2019 వరకూ ఎంబీబీఎస్  సీట్ల కేటాయింపు దాదాపు ఒకే విధంగా జరిగింది. జీవో 111 పేరిట ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన నిబంధనలనే అప్పట్లో తెలంగాణ గవర్నమెంట్ అన్వయించుకుని, 114 పేరిట జీవో తెచ్చింది. ఈ జీవో గందరగోళంగా ఉండడంతో.. అధికారులు తమకు నచ్చిన విధంగా కౌన్సెలింగ్ చేయడంతో రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్  కేటగిరీ స్టూడెంట్లకు రెండు  రాష్ట్రాల్లోనూ అన్యాయం జరిగింది. దీనిపై రెండు రాష్ట్రాల స్టూడెంట్లు కోర్టుకు వెళ్లారు. కోర్టు సూచనలతో ఏపీ ప్రభుత్వం 2020 మార్చిలోనే ఆరుగురు సభ్యుల ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కమిటీని వేసింది. ఈ కమిటీ సూచనల మేరకు 111 జీవోను పూర్తిగా మార్చేసి, 159 పేరిట మరో జీవోను తెచ్చింది. రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ స్టూడెంట్లకు అన్యాయం జరగకుండా, అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ సీట్లు లోకల్ (ఏపీ) స్టూడెంట్లకు వచ్చేలా రూల్స్​  పొందుపర్చింది. ఈ జీవో ప్రకారమే గతేడాది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎంబీబీఎస్  కౌన్సెలింగ్ చేపట్టింది. ఇవేమీ పట్టని మన రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రం పాత తప్పులనే రిపీట్​ చేసింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. 

నిరుడు 19 సీట్లు బ్లాక్​ చేసి..​

నిరుడు మన దగ్గర చివరి రౌండ్  కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్న ఏపీ స్టూడెంట్లు, ఇక్కడి ప్రైవేటు కాలేజీల్లోని 19 కన్వీనర్ కోటా సీట్లను బ్లాక్ చేసి, మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోటాలోకి వెళ్లేలా చేశారు. ఇందుకుగానూ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఆయా స్టూడెంట్లకు లక్షల్లో డబ్బు ముట్టజెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ. 60 వేల కన్వీనర్ కోటా సీటును, రూ. 10 లక్షల నుంచి 20 లక్షలకు అమ్ముకున్నట్లు విమర్శలు వచ్చాయి. 

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కాల్సినవి దక్కుతలేవ్..!

కౌన్సెలింగ్ రూల్స్ ప్రకారం ప్రతి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొదట ఓపెన్ కేటగిరీ సీట్లు భర్తీ చేసి, ఆ తర్వాత రిజర్వేషన్ కేటగిరీ సీట్లు భర్తీ చేయాలి. ఇలా చేయడం వల్ల మెరిట్ ర్యాంకు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్లకు ఓపెన్  కేటగిరీ సీట్లు పొందే అవకాశం ఉంటుంది. కానీ, మన దగ్గర సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ రూల్​ను  తుంగలో తొక్కుతున్నారు. తొలుత రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీట్లు భర్తీ చేసి, ఆ తర్వాత ఓపెన్ కేటగిరీ సీట్లను భర్తీ చేస్తున్నారు. దీంతో మంచి ర్యాంకులు ఉన్న స్టూడెంట్లు రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్  సీట్లలోకి వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత భర్తీ చేసే ఓపెన్ కేటగిరీ సీట్లలో మెజారిటీ సీట్లు ఓసీలకు దక్కుతున్నాయి. నిరుడు రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ స్టూడెంట్లకు దక్కాల్సిన దాదాపు రెండొందలకుపైగా సీట్లు పెద్ద కులాల స్టూడెంట్లకు దక్కినట్టుగా బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఏపీలో అట్ల ..తెలంగాణలో ఇట్ల

భజన చట్టం ప్రకారం.. తెలంగాణ, ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 15 శాతం సీట్లను ఇరు రాష్ట్రాల స్టూడెంట్లకు అవకాశం దక్కేలా ఓపెన్  కేటగిరీలో భర్తీ చేస్తారు. మెరిట్ ర్యాంకు ఎవరికి ఉంటే, వారికే సీటు ఇస్తారు. ఈ కేటగిరీలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల కోసం ఏపీ, తెలంగాణ నుంచి మెరిట్ ర్యాంకర్స్​ పోటీపడు తున్నారు. ఫస్ట్ రౌండ్ సీట్ల కేటాయింపు తర్వాత కొంతమంది ఆ సీట్లను వదిలేసుకుంటున్నారు. ఏపీలో ఇలా మిగిలిన సీట్లను, మెరిట్​లిస్టులో తర్వాతి ప్లేస్‌లో ఉన్న లోకల్ స్టూడెంట్లకు ఇస్తున్నారు. తెలంగాణలో మాత్రం ఇట్లా ఇవ్వకుండా.. సెకండ్​ ఫేజ్​​ కౌన్సెలింగ్​లో భర్తీ చేస్తున్నారు. మొదట ఏపీలోనూ ఇదే తప్పు చేశారు. అక్కడ తెలంగాణ స్టూడెంట్లకు ఎక్కువ సీట్లు రావడం గమనించి రూల్స్‌ మొత్తం మార్చేశారు. ఫస్ట్‌ ఫేజ్​​లో మిగిలిన సీట్లు ఏపీ వాళ్లకే దక్కేలా జీవో తెచ్చారు. సీట్ల ‘బ్లాకింగ్’ దందా జరగకుండా చివరి రౌండ్ కౌన్సెలింగ్‌లో తెలంగాణ స్టూడెంట్లు పాల్గొనడానికి వీళ్లేదని ఏపీ సర్కారు రూల్ తెచ్చింది. మన దగ్గర మాత్రం అన్ని రౌండ్లలోనూ ఏపీ స్టూడెంట్లు పాల్గొనేందుకు అవకాశం ఇస్తున్నారు. దీంతో ఇక్కడివాళ్లకు అన్యాయం జరగడమే కాకుండా సీట్ల ‘బ్లాకింగ్’​ దందా నడుస్తోంది. 

కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అడ్డుకుంటం

ఎంబీబీఎస్​ సీట్ల కౌన్సెలింగ్​లో మూడేండ్ల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతోంది. ఈ విషయాన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల దృష్టికి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లినం. నేషనల్ కోటా కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌లో కేంద్రం మార్పులు చేసింది. ఏపీ ప్రభుత్వం కూడా నిరుడు కౌన్సెలింగ్ నిబంధనలు మార్చింది. తెలంగాణ సీఎంవోలో ఉన్న కొంత మంది అధికారులు ఇక్కడ మార్పులు జరగకుండా అడ్డుకుంటున్నరు. నిరుడు రిజర్వ్‌‌‌‌‌‌‌‌డ్ కేటగిరీ స్టూడెంట్లకు దక్కాల్సిన సుమారు 300 ఎంబీబీఎస్  సీట్లు, అగ్ర కులాల స్టూడెంట్లకు కేటాయించిన్రు. రూల్స్​లో మార్పులు చేయకపోతే ఈసారి కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌ను అడ్డుకుంటం.
- ఆర్. కృష్ణయ్య,   జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు

కోర్టులో పిల్ వేస్తం

ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ స్టూడెంట్లకు దక్కాల్సిన సీట్లు ఏపీ స్టూడెంట్లకు వెళ్తున్నయ్​. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన సీట్లు, ఓసీలకు కేటాయిస్తున్నరు. నిరుడు ఫిర్యాదు చేస్తే.. అప్పటికే  కౌన్సెలింగ్ సమయం ముగుస్తోందని, 2021 కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాటికి నిబంధనలు మారుస్తామని హెల్త్ సెక్రటరీ రిజ్వీ చెప్పిన్రు. ఇప్పటికీ ఆయనే హెల్త్ సెక్రటరీగా ఉన్నరు. కానీ, కౌన్సెలింగ్ రూల్స్​ మాత్రం మార్చలేదు. ఈ అంశంపై త్వరలోనే కోర్టులో పిల్ దాఖలు చేస్తం. 
- జాజుల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తెలంగాణ బీసీ
   సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు