
చేవెళ్ల, వెలుగు: గ్రామీణ క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. షాబాద్ మండల కేంద్రంలోని స్టేడియంలో ఏఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైర్మన్ ఎలుగంటి అభిరామ్రెడ్డి నిర్వహిస్తున్న ఎస్పీఎల్–-3 క్రికెట్ టోర్నమెంట్ను ఆదివారం (జూన్ 29) చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో యువత సత్తా చాటాలని సూచించారు. ప్రతీ పాఠశాలలో ఒక స్పోర్ట్స్టీచర్ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలోని అన్ని స్టేడియాలను అభివృద్ధి చేస్తామన్నారు. షాబాద్ స్టేడియంకు నిధులు మంజూరు చేస్తామని, ఏయే పనులు కావాలో తనకు నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ..క్రీడకారుల గెలుపోటములను సమా నంగా తీసుకొని, లక్ష్యం దిశగా ముందుకుసాగాలని సూచించారు. గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, ముడిమ్యాల, పెద్ద మంగళారం సహకార సంఘాల చైర్మన్లు ప్రతాప్ రెడ్డి, చంద్రారెడ్డి, పీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్, మాజీ ఎంపీటీసీలు కుమ్మరి చెన్నయ్య, గుండాల అశోక్, పర్వేద మల్లేశ్, మాజీ సర్పంచులు జనార్ధన్రెడ్డి, నరేందర్రెడ్డి, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.