పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎప్పటి నుంచి అంటే.?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎప్పటి నుంచి అంటే.?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీ ఖరారయ్యింది. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు జరగనున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కిరణ్ రిజీజు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ పై చర్చిస్తామని వెల్లడించారు.

ఆపరేషన్ సిందూర్ పై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టాలని గత కొన్ని రోజులు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వాస్తవాలేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది. 

ఈ సారి పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. పహల్గామ్ టెర్రర్ అటాక్ కు బదులుగా పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు ఇప్పటికే పలు సందేహాలు లేవెనెత్తాయి. బీజేపీ ఆపరేషన్ సిందూర్ ను రాజకీయంగా వాడుకుంటోందని విమర్శిస్తున్నాయి.  ఆపరేషన్ సిందూర్ లో భారత యుద్ధ విమానాలు ఎన్ని ధ్వంసం అయ్యాయో చెప్పాలని ప్రశ్నిస్తున్నాయి. అమెరికాకు తలొగ్గే కేంద్రం ఆపరేషన్ సిందూర్ ను నిలిపివేసిందని చెబుతున్నాయి.