నిర్మల్ జిల్లాలో 12 ఏండ్ల తరువాత తెరుచుకున్న స్కూల్

నిర్మల్ జిల్లాలో 12 ఏండ్ల తరువాత తెరుచుకున్న స్కూల్

భైంసా, వెలుగు: 12 ఏండ్ల కింద మూతబడిన గవర్నమెంట్​ స్కూల్  ఎట్టకేలకు తెరుచుకుంది. నిర్మల్  జిల్లా భైంసా మండలం బాబుల్​గావ్​లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 12 ఏండ్ల కింద మూతపడింది. ఏళ్లుగా గ్రామంలో స్కూల్​ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. విషయాన్ని గ్రామస్తులు ముథోల్​ ఎమ్మెల్యే రామారావు పటేల్  దృష్టికి తీసుకెళ్లడంతో జిల్లా అధికారులతో మాట్లాడి స్కూల్​ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు.​ 

మంగళవారం స్కూల్​ను పున: ప్రారంభించి, విద్యార్థులకు బుక్స్​ పంపిణీ చేశారు. స్కూల్​కు ఒక టీచర్​ను కేటాయించగా, 20 మంది పిల్లలు అడ్మిషన్​తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్టూడెంట్లు, పేరెంట్స్​ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని స్కూల్​ను పున: ప్రారంభించామని తెలిపారు. పేరెంట్స్​ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని డీఈవో రామారావు, ఎంఈవో సుభాష్​ కోరారు.