ఇంద్రేశం, జిన్నారం మున్సిపాల్టీల..ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

ఇంద్రేశం, జిన్నారం మున్సిపాల్టీల..ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పంచాయ‌‌తీ రాజ్ (రెండో స‌‌వ‌‌ర‌‌ణ‌‌) చ‌‌ట్టం 2025, తెలంగాణ మున్సిపాలిటీ (మూడో సవరణ) బిల్లులకు గ‌‌వ‌‌ర్నర్  జిష్ణుదేవ్​ వర్మ ఆమోద ముద్ర వేశారు.  సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటుకు ఓకే చెప్పారు. అదేవిధంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తర‌‌ణ‌‌, న‌‌ల్గొండ జిల్లాలోని హాలియా మున్సిపాలిటీ ప‌‌రిధిలోని ఇబ్రహీంపేటను నూత‌‌న గ్రామ పంచాయ‌‌తీగా ఏర్పాటు చేసేందుకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారు. 

వీటిపై  అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్​కు పంపగా, గురువారం ఆమోదం తెలిపారు.  తర్వాత లా సెక్రటరీ పాపిరెడ్డి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. స్థానిక సంస్థల్లో రిజ‌‌ర్వేష‌‌న్ల పెంపునకు ఉద్దేశించిన తెలంగాణ పంచాయ‌‌తీ రాజ్(మూడో స‌‌వ‌‌ర‌‌ణ‌‌) చ‌‌ట్టం 2025 బిల్లును కూడా అసెంబ్లీలో ఆమోదించి పంపగా.. దానికి గ‌‌వ‌‌ర్నర్  ఓకే చెప్పలేదు. ఈ బిల్లుకు గవర్నర్​ ఓకే చెప్పారని.. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయిందంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలను రాజ్ భవన్ కొట్టిపారేసింది.