విమోచన దినోత్సవం నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది : గవర్నర్ 

విమోచన దినోత్సవం నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది : గవర్నర్ 

హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో జాతీయ జెండాను గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ర్ట ప్రజలందరికీ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడారు. 

భారత్ ఇప్పుడు చంద్రుడుపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తోందన్నారు గవర్నర్ తమిళి సై. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇది మన స్వేచ్ఛ, సమైక్యతకు ప్రతీక అని చెప్పారు. ఈ హక్కు కోసం ఎందరో నాయకులు తమ జీవితాలను త్యాగం చేశారని అన్నారు. 

ALSO READ: ప్రభుత్వం రైస్​మిల్లర్లకు అన్యాయం చేయదు : మంత్రి గంగుల కమలాకర్​

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకి తీసుకెళ్లడంలో తమ వంతు కృషి చేస్తామని  చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో చాలామంది నాయకుల పాత్ర ఉన్నా..  యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుని యువత ఈ ఏడాదిలో దానిని పూర్తి చేస్తే బాగుంటుందని సూచించారు. రాజ్ భవన్ తరపున ఈ ఏడాది మొత్తం సీపీఆర్ శిక్షణపై అవగాహన కల్పిస్తామన్నారు. పెద్ద పెద్ద మాటల కంటే ... చిన్న చిన్న పనులు గొప్పవి అని చెప్పారు.