ఆర్టీసీ బకాయిలు విడుదల చేయాలి: అశ్వత్థామ రెడ్డి

ఆర్టీసీ బకాయిలు విడుదల చేయాలి: అశ్వత్థామ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని సంస్థ  జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేశారు. దసరా పండుగ వేళ 44 వేల మంది కార్మికులు ఆర్థికంగా  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన జూమ్ ద్వారా  జేఏసీ మీటింగ్ నిర్వహించారు.  మీటింగ్ అనంతరం ఒక ప్రకటన రిలీజ్ చేశారు.

 రెండు పీఆర్సీలు, డీఏ బకాయిలు ఏండ్ల నుంచి పెండింగ్ లో ఉన్నా మేనేజ్ మెంట్ ఇవ్వటం లేదని తెలిపారు. కార్మికుల బకాయిలు చెల్లిస్తామని గత 2 నెలలుగా ఎండీ సజ్జనార్ చెబుతూ వచ్చారని, ఇపుడు మోసం చేశారని గుర్తు చేశారు. ఎలక్షన్ కోడ్ రావటంతో కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని తెలిపారు. దసరా వేళ కార్మికులు నిరాశతో ఉన్నారని వెల్లడించారు. అధికార పార్టీ మేనిఫెస్టోలో ఆర్టీసీపై ఎలాంటి ప్రస్తావన లేకపోవటం బాధాకరమని అశ్వథ్థామ పేర్కొన్నారు.