వికారాబాద్, వెలుగు: జీపీవో, లైసెన్స్డ్సర్వేయర్ల నియామక పరీక్షలను ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలుర హైస్కూల్లో నిర్వహించారు. ఎగ్జామ్సెంటర్ను కలెక్టర్ ప్రతీక్ జైన్ తనిఖీ చేశారు. జీపీవో పరీక్షకు 83 మంది అభ్యర్థులకు గానూ 66 మంది, లైసెన్స్డ్సర్వేయర్ఎగ్జామ్కు 139 మంది గానూ 121 మంది హాజరైనట్లు తెలిపారు. అడిషనల్కలెక్టర్ లింగ్యా నాయక్, ఆర్డీవో వాసుచంద్ర, డీటీడీవో కమలాకర్ రెడ్డి, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్రాజేశ్వరి, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ నెమత్ అలీ తదితరులున్నారు.
శంషాబాద్: పాలమాకులలోని పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ లో లైసెన్స్డ్ ఆదివారం ల్యాండ్ సర్వేయర్అర్హత పరీక్ష నిర్వహించగా అడిషనల్కలెక్టర్ప్రతిమా సింగ్ తనిఖీ చేశారు. మొత్తం 403 మంది అభ్యర్థులకు గానూ 329 మంది హాజరయ్యారని తెలిపారు. సర్వే అండ్ ల్యాండ్రికార్డ్స్ఆఫీసర్ శ్రీనివాస్, రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్ రెడ్డి, తహసీల్దార్ అవిందర్ దత్ తదితరులున్నారు.
బాలాపూర్ మండలం జిల్లెలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జీపీవో ఎగ్జామ్సెంటర్ను డీఆర్వో సంగీత, ఏవో సునీల్ తనిఖీ చేశారు. మొత్తం 111 మంది అభ్యర్థులకు గానూ101 మంది హాజరైనట్లు తెలిపారు. తహసీల్దార్ ఇందిరాదేవి తదితరులు పాల్గొన్నారు.
