
నల్లగొండ- ఖమ్మం- వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల బైపోల్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నాం 12 గంటల వరకు 605 పోలింగ్ స్టేషన్లకు గాను 4 లక్షల 63 వేల 839 మంది ఓటర్లలో1 లక్షా 35 వేల 900 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 29.30 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాల వారిగా పరిశీలిస్తే..
- సిద్దిపేట జిల్లాలో 5 పోలింగ్ స్టేషన్లకు గాను 4 వేల 679 మంది ఓటర్లలో 1553 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 11.03 శాతం పోలింగ్ నమోదైంది.
- జనగామ జిల్లాలో 27 పోలింగ్ స్టేషన్లకు గాను 23 వేల 416 మంది ఓటర్లలో 6 వేల 6647 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 28.38 శాతం పోలింగ్ నమోదైంది.
- హనుమకొండ జిల్లాలో 67 పోలింగ్ స్టేషన్లకు గాను 43వేల 729 మంది ఓటర్లలో 14 వేల 389 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 32.90 శాతం పోలింగ్ నమోదైంది.
- వరంగల్ జిల్లాలో 59 పోలింగ్ స్టేషన్లకు గాను 43వేల 812 మంది ఓటర్లలో 13 వేల 602 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 31.05 శాతం పోలింగ్ నమోదైంది.
- మహబూబాబాద్ జిల్లాలో 36 పోలింగ్ స్టేషన్లకు గాను 34వేల 933 మంది ఓటర్లలో 9 వేల 951 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 28.49 శాతం పోలింగ్ నమోదైంది.
- ములుగు జిల్లాలో 17 పోలింగ్ స్టేషన్లకు గాను 10వేల 299 మంది ఓటర్లలో3 వేల 295 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 31.99 శాతం పోలింగ్ నమోదైంది.
- భూపాలపల్లి జిల్లాలో 16 పోలింగ్ స్టేషన్లకు గాను 12వేల 535 మంది ఓటర్లలో 3వేల 471 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 27.69 శాతం పోలింగ్ నమోదైంది.
- భద్రాద్రి జిల్లాలో 55 పోలింగ్ స్టేషన్లకు గాను 40వేల 106 మంది ఓటర్లలో 10 వేల 342 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు25.79 శాతం పోలింగ్ నమోదైంది.
- ఖమ్మం జిల్లాలో 118 పోలింగ్ స్టేషన్లకు గాను 83వేల 879 మంది ఓటర్లలో 25 వేల313 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 30.18 శాతం పోలింగ్ నమోదైంది.
- యాదాద్రి భువనగిరి జిల్లాలో 37 పోలింగ్ స్టేషన్లకు గాను 34వేల 080 మంది ఓటర్లలో 9 వేల445 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 27.71 శాతం పోలింగ్ నమోదైంది.
- సూర్యాపేట జిల్లాలో 71 పోలింగ్ స్టేషన్లకు గాను 51వేల 497 మంది ఓటర్లలో 16 వేల103 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 21.27 శాతం పోలింగ్ నమోదైంది.
- నల్లగొండ జిల్లాలో 97 పోలింగ్ స్టేషన్లకు గాను 80వేల 871 మంది ఓటర్లలో 21వేల789 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 26.94శాతం పోలింగ్ నమోదైంది.