ధాన్యం కొనుగోళ్లు లేక రైతుల ఇబ్బందులు

ధాన్యం కొనుగోళ్లు లేక రైతుల ఇబ్బందులు

సూర్యాపేట జిల్లా: నేరెడుచర్ల మండలం, చిల్లేపల్లి దగ్గర కొనుగోళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా రైస్ మిల్లుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. దీంతో కిలోమీటర్లలో ట్రాక్టర్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇప్పటికే వర్షాలతో రైతులు ఇబ్బదులు పడుతున్నారు. IKP సెంటర్లు ఎక్కడా ఓపెన్ చెయ్యలేదంటున్నారు రైతులు. వరి కోతపై కూడా అధికారులు ఆంక్షలు పెట్టారు. మిర్యాలగూడలోనే రైసు మిల్లులు ఎక్కువగా ఉండటంతో.. ఆ ప్రాంతంలో ట్రాక్టర్లు క్యూ కట్టాయి. అధికారులు తమను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు.