నారాయణపేట, వెలుగు :నారాయణపేటలో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ అకాల వర్షం కురవడంతో వ్యవసాయ మార్కెట్కు తీసుకొచ్చిన వరి ధాన్యం నీటిపాలై తడిసి ముద్దయింది. ధాన్యంపై కప్పుకోవడానికి మార్కెట్ కార్యాలయంలో కనీసం తాడిపత్రులు అందుబాటులో లేకపోవడంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే నానిపోతుంటే మార్కెట్ అధికారుల నిర్లక్ష్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

