మంత్రి ఆదేశంతో పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

మంత్రి ఆదేశంతో పంచాయతీ కార్యదర్శి సస్పెండ్
  • గ్రామంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంపై మంత్రి ఆగ్రహం
  • గ్రామ కార్యదర్శి సస్పెన్షన్ వేటు

హనుమకొండ జిల్లా: ఐనవోలు మండలం నందనం గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకన్నను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పల్లె ప్రగతి పనుల పరిశీలనలో భాగంగా నిన్న నందనం గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. గ్రామంలో వీధులన్నీ అపరిశుభ్రంగా ఉండడం.. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడం గుర్తించిన మంత్రి ఎర్రబెల్లి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చదనం పరిశుభ్రతను మెరుగుపరచాలని ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తుంటే.. ఇక్కడేమో  ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
మంత్రి ఎర్రబెల్లి ఆదేశాలకు స్పందించిన జిల్లా అధికారులు  గ్రామ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామంలో పచ్చదనం పరిశుభ్రతను పరిరక్షించే విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు బాధ్యతగా సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.