
హైదరాబాద్ సిటీ, వెలుగు: బంజారాహిల్స్ గోల్డెన్ టెంపుల్ లో ఆదివారం శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హరేకృష్ణ మూమెంట్రాష్ట్ర అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస ప్రభూజీ తెలిపారు. తెలంగాణలో మొట్టమొదటి గోల్డెన్టెంపుల్ఇదేనని, నరసింహస్వామి జయంతిని వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతి భక్తునికి జూలన్సేవలో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. 11న మహాభిషేకం, జూలన్ సేవ, హరినామ సంకీర్తన, స్వామి వారి కల్యాణం, 108 కలశాలతో అభిషేకం, మహా మంగళ హారతి కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు.