మెల్బోర్న్: సీజన్ ఆరంభ గ్రాండ్స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్మనీ భారీగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే 13 శాతం పెంచినట్లు నిర్వాహకులు తెలిపారు. టోర్నీ మొత్తం ప్రైజ్మనీ రూ. 485 కోట్లు (58.4 మిలియన్ డాలర్లు)గా నిర్ణయించారు. మెన్స్, విమెన్స్ సింగిల్స్లో విజేతలుగా నిలిచిన ప్లేయర్లకు చెరో రూ. 17.88 కోట్లు ఇవ్వనున్నారు.
తొలి రౌండ్లో క్వాలిఫై అయిన ప్లేయర్లు రూ. 17 లక్షలు అందుకోనున్నారు. క్వాలిఫయింగ్, తొలి రౌండ్ ప్లేయర్లకు మేలు కలిగేలా ప్రైజ్మనీని పెంచాం. సింగిల్స్, డబుల్స్ ప్లేయర్లు సమానంగా చెక్స్ అందుకుంటారు. అందరికీ న్యాయం జరగాలని ఈసారి 13 శాతం పెంచాం’ అని టోర్నీ డైరెక్టర్ క్రెయిగ్ టిలీ తెలిపాడు. అయితే నాలుగు గ్రాండ్స్లామ్స్ను పరిగణనలోకి తీసుకుంటే యూఎస్ ఓపెన్ ప్రైజ్మనీ ఎక్కువగా (65 మిలియన్ డాలర్లు) ఉంది.