బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ ను పార్టీ హైకమాండ్ రాజ్యసభకు పంపడం రాష్ట్రానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు... కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. పార్టీలో సీనియర్లకు ఎప్పుడూ అవకాశాలు ఉంటాయన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటిసారి రాజ్యసభ ఎంపీగా అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు లక్ష్మణ్. ఇది కార్యకర్తలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేస్తామని చెప్పారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు లక్ష్మణ్ కు ఘన స్వాగతం పలికారు.
ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై తొలిసారిగా హైదరాబాద్ విచ్చేసిన @drlaxmanbjp గారికి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన బిజెపి నేతలు.#DrKLaxmanInRajyaSabha pic.twitter.com/kXtBv8r9T2
— BJP Telangana (@BJP4Telangana) June 4, 2022
మరిన్ని వార్తలు కోసం...
బూస్టర్ డోసుగా కార్బెవాక్స్ టీకా.. పర్మిషన్ ఇచ్చిన డీసీజీఐ