హైదరాబాద్, వెలుగు: గ్రాఫైట్ ఎలక్ట్రోడ్లను ఉత్పత్తి చేసే కోల్కతా కంపెనీ గ్రాఫైట్ ఇండియా లిమిటెడ్.. గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో రూ.50 కోట్ల విలువైన 31 శాతం వాటాను దక్కించుకుంది. ఈ డీల్విలువ రూ.50 కోట్లని గ్రాఫైట్ తెలిపింది. ప్రస్తుతం వెంచర్ క్యాపిటల్ ఫండ్ అయిన బ్లూ అశ్వ క్యాపిటల్ మద్దతుతో నడుస్తున్న గోడి ఇండియాకు అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్లో స్పెషలైజేషన్ ఉంది.
ఎలక్ట్రిక్ వెహికల్స్, సూపర్ కెపాసిటర్ ఆధారిత ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థల కోసం స్థిరమైన బ్యాటరీల తయారీకి ఇది మద్దతు ఇస్తుంది. భారతీయ, ప్రపంచ మార్కెట్ల కోసం లిథియం అయాన్, సోడియం అయాన్ సాలిడ్- స్టేట్ బ్యాటరీల అభివృద్ధికి గోడి ఇండియా నాయకత్వం వహిస్తోందని కంపెనీ తెలిపింది.