గ్రేటర్ సిటీలో వినాయక నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. సిటీలోని పలు ప్రాంతాల్లో డిఫరెంట్ థీమ్లతో రూపొందించిన గణేశ్ విగ్రహాలు, మండపాలు
ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇస్రో, జీ–20 సమ్మిట్థీమ్ గణనాథుల మండపాలు ఆకట్టుకుంటున్నాయి.
నారాయణగూడ స్ట్రీట్ నం.5లో ఏర్పాటు చేసిన గణనాథుని చేతిలో బంగారంతో తయారు చేసిన లడ్డూను ఉంచారు. నిమజ్జనం రోజున లడ్డూను వేలం వేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరోవైపు ఎన్టీఆర్ స్టేడియంలో గణనాథుల నిమజ్జనం కొనసాగుతోంది. నాలుగు బేబి పాండ్స్, 4 క్రేన్లను ఏర్పాటు చేశారు.