కాశీబుగ్గ(కార్పొరేషన్)/ వరంగల్ సిటీ, వెలుగు: గ్రేటర్ వరంగల్లోని బల్దియా హెడ్ ఆఫీస్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి 117 ఫిర్యాదులు వచ్చినట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారానికి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కార నిమిత్తం ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, డీఎఫ్వో శంకర్ లింగం, ఇన్చార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, శ్రీనివాస్, టీవో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
