హైదరాబాద్, వెలుగు : సీతమ్మసాగర్, గౌరవెల్లి ప్రాజెక్టుల్లో పర్యావరణ ఉల్లంఘనలపై తెలంగాణ ఇరిగేషన్ఇంజినీర్లతో గోదావరి రివర్మేనేజ్మెంట్ (జీఆర్ఎంబీ)బోర్డు ఈ నెల 11న సమావేశం ఏర్పాటు చేసింది. ఈమేరకు తెలంగాణ ఈఎన్సీకి లేఖ రాశారు. పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే గౌరవెల్లి రిజర్వాయర్, సీతమ్మ సాగర్ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. తుది అనుమతులు తీసుకునే వరకు ఆయా ప్రాజెక్టుల పనులు నిలిపి వేయాలని ఎన్జీటీ ఆదేశించింది. పనులు ఆపేశారో లేదో పర్యవేక్షించేందుకు వర్క్సైట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా స్పష్టం చేసింది.
ఈనేపథ్యంలో ఈనెల 11న 3 గంటలకు జలసౌధలో జీఆర్ఎంబీ చైర్మన్ ఎంకే సిన్హా అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరు కావాలని కరీంనగర్ఈఎన్సీ శంకర్, కొత్తగూడెం సీఈ శ్రీనివాస్రెడ్డికి సమాచారం ఇచ్చారు. సీతమ్మ సాగర్బ్యారేజీ, మల్టీ పర్పస్ప్రాజెక్టు పనుల పరిశీలనకు జీఆర్ఎంబీతో పాటు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారితో కమిటీ ఏర్పాటు చేశారు.
ఆ కమిటీ ఇచ్చిన నివేదికపై ఎన్జీటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఇరిగేషన్ఇంజినీర్లతో బోర్డు సమావేశం ఏర్పాటు చేసింది. ఆయా ప్రాజెక్టుల పనుల ప్రోగ్రెస్, ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఏమైనా పనులు చేశారా? ప్రస్తుతం ఆయా వర్క్సైట్లలో ఏమైనా పనులు చేస్తున్నారా? అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా? వాటి పుటేజీ తాము ఎలా తీసుకోవాలి? అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.