గ్రూప్ 1 అప్లికేషన్లు 2 లక్షలు దాటినయ్

గ్రూప్ 1 అప్లికేషన్లు 2 లక్షలు దాటినయ్

హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 అప్లికేషన్లు 2 లక్షలు దాటాయి. మంగళవారం రాత్రి వరకు 2,00,428 మంది దరఖాస్తు చేశారు. ఈ నెల31 వరకు అప్లయ్‌ చేసేందుకు అవకాశముంది. గ్రూప్​1లోని యూనిఫామ్ పోస్టులకు హైట్ తగ్గింపు, ఏజ్ లిమిట్ పెంపుపై ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులిచ్చింది. దీంతో ఈ వారం రోజుల్లో లక్షన్నర నుంచి రెండు లక్షల దాకా దరఖాస్తులు రావచ్చని టీఎస్​పీఎస్సీ అధికారులు అంచనా వేస్తున్నారు. టీఎస్​పీఎస్సీ ఓటీఆర్ అప్​డేట్ చేసుకునేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపించట్లేదు. మొత్తం 25 లక్షల మంది రిజిస్టర్‌‌ చేసుకోగా, వారిలో మంగళవారం నాటికి 2,90,079 అప్​డేట్ చేసుకున్నారు. కొత్తగా 1,39,709 మంది ఓటీఆర్ రిజిస్టర్ చేసుకున్నారు. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థుల బోనఫైడ్ సర్టిఫికెట్లనుతర్వాత అయినా అప్​లోడ్ చేయొచ్చని అధికారులు సూచిస్తున్నారు.