సీఎంకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్–1, 3 నోటిఫికేషన్లు రిలీజ్ చేయలేదని, వయసు దాటిపోతోందని యువకులు ఆవేదన చెందుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. వెంటనే ఈ రెండు నోటిఫికేషన్లు రిలీజ్ చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఆదివారం ఆయన లెటర్ రాశారు. ఉమ్మడి ఏపీలో 2011లో 140 పోస్టులతో గ్రూప్–1 నోటిఫికేషన్ రిలీజ్ చేశారని గుర్తుచేశారు.