తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. 2023 జూలై 31 సోమవారం వరకు ఫలితాలు ప్రకటించవద్దొని TSPSC ని ఆదేశించింది, ప్రిలిమ్స్ ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం... కౌంటర్ దాఖలు చేయాలని TSPSC కి సూచించింది.
వాదనలు వినిపించేందుకు సోమవారం వరకు TSPSC సమయం కోరగా అప్పటివరకు ఫలితాలు ఇవ్వొద్దని కోర్టు సూచించింది. కాగా 2023 జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 2.33 లక్షల మందికి పైగా హాజరయ్యరు.