జులై మొదటి వారం లో గ్రూప్ 2 ఇంటర్వ్యూలు

జులై మొదటి వారం లో గ్రూప్ 2 ఇంటర్వ్యూలు

గ్రూప్ 2 రాసిన అభ్యర్ధులకు గుడ్ న్యూస్.  వచ్చే నెల మొదటి వారం లో గ్రూప్ 2 ఇంటర్వ్యూలుంటాయని టీఎస్పీఎస్సి చైర్మన్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. ఈ రోజు రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసిన చక్రపాణి.. TSPSC 2017-2018 వార్షిక నివేదికను ఆయనకు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మరో రెండురోజుల్లో గ్రూప్ 2 కి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని చెప్పారు. దాదాపు 2 వేల మందిని ఇంటర్వ్యూ చేయాలి కాబట్టి ఇంటర్వ్యూ షెడ్యూల్ 2 నెలలు వరకు ఉండే అవకాశం ఉందన్నారు. టీఆర్టీకి సెలక్టయిన వారి వివరాలను ప్రభుత్వానికి పంపామని, త్వరలోనే నియామకాలు ఉంటాయని అన్నారు. కోర్ట్ కేసుల వలన ఆగిపోయిన పోస్ట్ లను కూడా త్వరలోనే క్లియర్ చేస్తామని సీఎం కేసీఆర్ అన్నట్లు చక్రపాణి తెలిపారు.