తెలంగాణ రాష్ట్రంలోని 50 బీసీ స్టడీసర్కిళ్ల పరిధిలో సెప్టెంబరు 1 నుంచి టీఎస్పీఎస్సీ గ్రూప్-3, 4, డీఎస్సీ, గురుకుల ఉపాధ్యాయ పోస్టుల పోటీపరీక్షలకు ప్రత్యక్ష శిక్షణ ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించి బీసీ అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: గ్రూప్-3, 4 శిక్షణ కోసం పది, ఇంటర్, డిగ్రీలో 60 శాతం మార్కులు, డీఎస్సీ, గురుకుల పోస్టులకు బీఈడీలో 60 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హులు. అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: విద్యార్హత పరీక్షలో వచ్చిన మార్కులు, సీట్ల లభ్యత ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్థులు బీసీ స్టడీసర్కిల్ వెబ్సైట్ ద్వారా ఆగస్టు 25లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 27న ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. కోచింగ్ సెప్టెంబర్ 1న ప్రారంభం అవుతుంది. వివరాల కోసం 040-–24071178 లేదా 040-–27077929 ఫోన్ నంబర్స్కు సంప్రదించాలి.
వెబ్సైట్: www.studycircle.cgg.gov.in